గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పెదవి విరిచారు. తన ప్రసంగంలో గవర్నర్ కేవలం నవరత్నాల గురించే ప్రస్తావించారని అన్నారు. ఏపీలోని చేతి వృత్తుల గురించి గవర్నర్ ప్రస్తావించలేదని బాలకృష్ణ విమర్శించారు. జలయజ్ఞం తరహాలో నీటి ప్రాజెక్టుల ప్రస్తావన ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను బంట్రోతు అనడం సరికాదని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాప్రతినిధులు ప్రజలకు బంట్రోతులేనని బాలకృష్ణ స్పస్టం చేశారు. అందరూ ప్రజలకు సేవ చేయాల్సిందేనన్నారు.