ఏపీ సీఎం జగన్పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్కు అనుభవం, అవగాహన లేదని విమర్శించారు. అన్ని పరిశీలించాకే చంద్రబాబు భవనాన్ని అద్దెకు తీసుకున్నారని ఆ భవనాన్ని 2007కు ముందే నిర్మించారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనపై ఎంక్వైరీ వేయడం దౌర్భాగ్యం అని చెప్పారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.