AP Assembly: బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందు సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. 12 టీడీపీ సభ్యుల సస్పెండ్‌

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

Update: 2023-03-16 06:10 GMT

AP Assembly: బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందు సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. 12 టీడీపీ సభ్యుల సస్పెండ్‌

AP Assembly:  ఏపీ బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న సమయంలో అసెంబ్లీలో కాసేపు గందరగోళం నెలకొంది. బడ్జెట్‌ కాపీని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదవడం మొదలు పెట్టిన వెంటనే తప్పుడు లెక్కలు అంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో స్పీకర్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభ నుంచి 12మంది సభ్యులను ఒక్కరోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.

Tags:    

Similar News