పోలీసుల ముందు లొంగిపోయిన కూన రవి కుమార్

Update: 2020-05-27 05:34 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పోలీసుల ముందు లొంగిపోయారు. గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బుధవారం పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి రవి కుమార్ కనిపించకుండా పోయారు. దీంతో నాలుగు రోజుల తర్వాత ఆయన అజ్ఞాతాన్ని వీడారు.

కూన రవి పొందూరు తహసీల్దార్‌తో అనుచితంగా మాట్లాడారని తమపై దౌర్జన్యం చేశారని తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. టీడీపీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి ర్యాలీగా పీఎస్‌కు వెళ్లారు. ఆయన బెయిల్ ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News