పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకిన టీడీపీ నేత

Update: 2020-03-06 07:26 GMT
పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకిన టీడీపీ నేత

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ భవనంపై నుంచి టీడీపీ నేత అవినాష్ దూకేశారు. అవినాష్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

గతకొన్నాళ్లుగా యస్.యం.పురంలో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య శివాలయం విషయంలో వివాదం నడుస్తోంది. ఈ వివాదం నేపధ్యంలో తరచూ అవినాష్ ను స్టేషన్ కు పిలిపిస్తున్నారట. కొద్దిరోజులుగా తనను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. అవినాష్ గతంలో ఎస్‌ఎంపురం సర్పంచ్‌గా పనిచేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News