తప్పుడు కేసులతో మమ్మల్ని వేధిస్తున్నారు.. నా భర్తకు ఏమైనా జరిగితే కర్నూలు ఎస్పీదే బాధ్యత
మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. యురేనియంపై పోరాడుతున్నందుకే తప్పుడు కేసులతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. బెయిల్పై ఉన్న వ్యక్తిని హింసిస్తున్నారని మండిపడ్డ అఖిలప్రియ తన భర్తకు ఏమైనా జరిగితే కర్నూలు ఎస్పీదే బాధ్యతని హెచ్చరించారు. భార్గవ్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామనడంలో నిజం లేదంటోన్న అఖిలప్రియ తానే స్వయంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించానని చెప్పుకొచ్చారు. ఇక, ప్రభుత్వ వేధింపులపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తానని అఖిలప్రియ అన్నారు.