మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విశాఖ జిల్లా నక్కపల్లి హైవే మీద ఆయన కారు డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. దాంతో అచ్చెన్నాయుడుకు గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్, ఎమ్మెల్యే గన్మెన్ లకు కూడా గాయాలు అయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అచ్చెన్నాయుడు చేతికి బలమైన గాయమైంది.
ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అయితే పెద్ద ప్రమాదమేమీ జరగలేదని అచ్చెన్నాయుడు తెలిపారు. చికిత్స అనంతరం ఆయన మరో కారులో ఇంటికి వెళ్లారు. ఆయన కారు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న టీడీపీ అభిమానులు అచ్చెన్నాయిడు ఇంటికి వెళ్లారు.