జనసేనలోకి టీడీపీ కీలక నేత!

Update: 2019-03-08 15:23 GMT

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు వలసలను ప్రోత్సాహిస్తున్నాయి. జనసేన సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో టీడీపీ, వైసీపీ పార్టీలలోని సీట్లు దక్కని నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేనలో చేరగా తాజాగా.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత దేవినేని మల్లిఖార్జున పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. మరో రెండ్రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరనున్నారని సమాచారం. ఈయనకు రేపల్లె అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారని జనసేన నేతలు అంటున్నారు. 

Similar News