ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని మండలి ఛైర్మన్కు టీడీపీ నేతలు లేఖ రాశారు. పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఛైర్మన్ను కోరారు. అయితే వీరు నిన్న టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో వారిని అనర్హులుగా ప్రకటించాలని లేఖ రాశారు.
మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసులు ఇచ్చింది. మండలి ఛైర్మన్కు సెలక్ట్ కమిటీ నోటీసులు అందించారు. బిల్లులకు పలు సవరణలు సూచిస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు మరో రెండు నోటీసులు ఇచ్చారు.