వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

Update: 2020-08-28 08:20 GMT

Panchakarla Ramesh: ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు వైసీపీలో చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రమేశ్‌బాబు పార్టీ కండువాకప్పుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కన్నబాబుపై పోటీ చేసి, ఓడిపోయారు. ఇక విశాఖ రాజధానిని టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక మూడు రాజధానుల నిర్ణయానికి ఓకే చెబుతూ తాజాగా పంచకర్ల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు పంచకర్ల రాకతో విశాఖలో వైసీపీ బలం మరింత పెరిగింది.

Tags:    

Similar News