Chandrababu: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Chandrababu: టీటీడీ పాలకమండలిలో మార్పులు చేయడంపై లేఖ

Update: 2021-09-17 06:35 GMT
సీఎం జగన్ కు లేఖ రాసిన చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Chandrababu: టీటీడీ పాలకమండలిలో మార్పులు చేయడంపై సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖరాశారు. పవిత్రక్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థగా పేరు ప్రఖ్యాతి కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదన్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన టీటీడీకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు జరగలేదన్నారు. స్వప్రయోజనాల కోసం రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారని ఆరోపించారు.

Tags:    

Similar News