మాదిపాడు వేద విద్యార్థుల ఘటన బాధాకరం: స్వరూపానందేంద్ర

వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2021-12-11 05:49 GMT

మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు

Guntur: గుంటూరు జిల్లాలోని మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం తరపున 50 వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివించడానికి సుముఖంగా ఉన్నట్లు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.

Tags:    

Similar News