ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ వాయిదా!

Update: 2019-08-24 05:18 GMT

విశ్వ నట చక్రవ‌ర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఆగ‌స్ట్ 25న‌ ఆవిష్క‌రించ‌నున్నట్టు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిధిగా కూడా హాజ‌ర‌వుతార‌ని వారు అన్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాలవల్ల దీనిని వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాలేదని చెప్పారు.త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News