కోనసీమలో మళ్లీ టెన్షన్.. ఎస్పీ కారుపై రాళ్ల దాడి!

Ravulapalem: కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. రావులపాలెం రింగురోడ్‌ వద్ద తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళన కారులు రాళ్లు విసిరారు.

Update: 2022-05-25 14:08 GMT

కోనసీమలో మళ్లీ టెన్షన్.. ఎస్పీ కారుపై రాళ్ల దాడి!

Ravulapalem: కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. రావులపాలెం రింగురోడ్‌ వద్ద తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళన కారులు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల వెంటపడటంతో అక్కడి నుంచి పరారయ్యారు. రావులపాలెంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎస్పీ వాహనం పూర్తిగా దెబ్బతింది. కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ కోనసీమ సాధన సమితి నేడు చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న అమలాపురంలో చోటుచేసుకన్న హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Tags:    

Similar News