సవతి తల్లి ఘాతుకం.. చిన్నారిని కాలువలో పడేసి హత్య?

Update: 2019-11-24 07:38 GMT

కాకినాడలో కిడ్నాప్ నకు గురైన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సవతి తల్లి శాంతికమారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని తేల్చారు. శుక్రవారం మధ్యాహ్నం దీప్తిశ్రీ కిడ్నాప్‌నకు గురైంది. తన మనవరాలిని అపహరించింది సవతి తల్లి శాంతి కుమారే అంటూ దీప్తిశ్రీ నాయయన్మ, మేనత్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..శాంతి కుమారిని అదుపులో తీసుకుని విచారించగా.. దీప్తిశ్రీని ఉప్పుటేరులో పడేసి హత్య చేసినట్లు నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం చిన్నారికోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌ వద్ద నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల దీప్తిశ్రీ చిన్నారిని కిడ్నాప్‌ కు గురైంది. దీప్తిశ్రీని అపహరించింది సవతి తల్లి శాంతి కుమారి. గతంలో కూడా దీప్తిపై వేధింపులకు పాల్పడింది ఆమె. పలుమార్లు చిన్నారికి వాతలు పెట్టినట్టు పాప నాయనమ్మ చెబుతున్నారు.  

Tags:    

Similar News