Paderu: లాక్‌డౌన్‌ అమలుపై ఎస్‌పి పరిశీలన

లాక్‌డౌన్‌ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్‌పి అట్టాడ బాబూజీ కోరారు.

Update: 2020-04-12 04:06 GMT

లాక్‌డౌన్‌ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్‌పి అట్టాడ బాబూజీ కోరారు. పాడేరులో పర్యటించి, లాక్‌డౌన్‌ అమలు తీరు, ప్రజల ఇబ్బందులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ తప్పనిసరి అన్నారు. ప్రజలు గుర్తెరిగి సహకరించాలన్నారు.

సడలింపు సమయంలో నిబంధనలకు లోబడి బయటకొచ్చి నిత్యావసరాలు కొనుక్కోవాలన్నారు. అనారోగ్య సమస్యలొస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాల నిఘా ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చేవారి వివరాల నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ఉందన్నారు. 

Tags:    

Similar News