వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై సోము వీర్రాజు ఫైర్
SomuVeerraju: అబద్ధాలను అందంగా ప్రచారం చేయడం వల్లే కాపులకు అన్యాయం
వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై సోము వీర్రాజు ఫైర్
SomuVeerraju: ఆంధ్రప్రదేశ్లో అబద్ధాన్ని అందంగా ప్రచారం చేయడంవల్లనే కాపులకు న్యాయం జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలో బీజేపీ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల రిజర్వేషన్లు కేంద్రం తీర్మానం చేయాలని ఏవిధంగా చెబుతారని సోమువీర్రాజు ప్రశ్నించారు. ముస్లింలకు మాత్రం కేంద్రం అవసరంలేదా కేవలం కాపులకు మాత్రం కేంద్రం కావాలా అంటూ పేర్నినానిపై కౌంటర్ వేశారు.