ఒక్కోక్కటి వెలుగు చూస్తున్న కోడెల శివరామ్‌ అక్రమాల చిట్టా..

Update: 2019-06-15 09:09 GMT

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వేశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ 15 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ బుడుమూరు నాగరాజు అనే క్రీడాకారుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో గత ఏడాది ఫిబ్రవరిలో నగదు ఇచ్చానన్నారు. అయినా ఉద్యోగం రాకపోవడంతో విషయాన్ని కోడెల శివప్రాద్ దృష్టికి తీసుకెళ్లాడు నాగరాజు. కోడెల అనుచరులు డబ్బు తీసుకున్నట్లు రాసిచ్చిన బాండ్ పేపర్ చించి వేశారని ఆరోపించారు. తాజాగా కోడెల కుటుంబంపై వస్తున్న ఫిర్యాదులతో తాను మోసపోయానని గుర్తించానన్నారు. తనకు న్యాయం జరకపోతే కోర్టును ఆశ్రయిస్తానని బాధితుడు నాగరాజు చెబుతున్నాడు. 

Tags:    

Similar News