సీఎం జగన్‌ను కలిసిన స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌

kidambi Srikanth: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.

Update: 2021-12-29 10:29 GMT

సీఎం జగన్‌ను కలిసిన స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌

kidambi Srikanth: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు కిదాంబి శ్రీకాంత్. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో కిదాంబి శ్రీకాంత్ రజత పతకం సాధించారు.

శ్రీకాంత్‌ను సీఎం జగన్ సన్మానించారు. ప్రభుత్వం తరఫున 7 లక్షల రూపాయల నగదు, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. బుధవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శాప్‌ ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News