కాకినాడలో ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. సవతి తలిపై అనుమానం

Update: 2019-11-24 05:47 GMT

ఏపీలో కొంతకాలంగా చిన్నారుల కిడ్నాప్‌లు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలను అపహరించి పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు కిడ్నాపర్లు. తాజాగా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. చిన్నారి మేనత్త ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌ వద్ద నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల దీప్తిశ్రీ చిన్నారిని కిడ్నాప్‌ కు గురైంది. అయితే దీప్తిశ్రీని అపహరించింది సవతి తల్లి శాంతి కుమారే అని ఆరోపిస్తోంది చిన్నారి నాయనమ్మ.

గతంలోనూ రెండు సార్లు దీప్తీశ్రీపై అమానుషంగా దాడి చేసిందని ఆరోపిస్తోంది. తన కొడుకు మొదటి భార్య చనిపోవడంతో శాంతి కుమారి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడని ఆమె తెలిపారు. గతంలో కూడా దీప్తికి వాతలు పెట్టినట్టు ఆమె చెబుతున్నారు. దీంతో సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో రకరకాలుగా సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Tags:    

Similar News