రోజా జన్మదినం సందర్బంగా సేవా కార్యక్రమాలు

Update: 2019-11-17 08:27 GMT

ఏపీఐఐసీ చైర్మన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా జన్మదినం నేడు.. ఈ సందర్బంగా నగరి నియోజకవర్గంలో ఆమె పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ తరపున పుత్తూరు పట్టణం 13వ వార్డులో వైయస్సార్ స్వఛ్చనీరు..రూ. 2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించే RO మినరల్ వాటర్ ప్యూరిఫైయర్ ను ఆమె ప్రారంభించారు.

అలాగే ప్లాస్టిక్ రహిత నగరిని తయారు చేయాలనీ సంకల్పించి.. జనపనార, గుడ్డతో తయారు చేసిన సంచులను అందించారు. డిసెంబర్ 21 నాటికి నగరి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ నుంచి కాపాడాలని ఆమె కోరారు. కాగా ఆమె నివాసంలో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు రోజా. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News