Andhra Pradesh: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు

Andhra Pradesh: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల విషయంలో ఎస్‌ఈసీ కౌంటర్‌ అఫిడవిట్ దాఖలు

Update: 2021-03-08 05:23 GMT
నిమ్మగడ్డ రమేష్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై (AP Elections 2021) హైకోర్టు ఇవాళ వాదనలు విననుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల విషయంలో ఎస్‌ఈసీ కౌంటర్‌ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారం ఎస్‌ఈసీదేనని స్పష్టం చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 324 ప్రకారం ఎస్‌ఈసీకి నియంత్రణ, పర్యవేక్షణ, నిర్దేశం అధికారాలున్నాయన్నారు. తుది జాబితా ప్రకారం జడ్పీటీసీలకు 126, ఎంపీటీసీలకు 2363 మంది ఏకగ్రీవం అయ్యారు.

Tags:    

Similar News