అప్పన్న ఆలయంలో ట్రస్ట్ బోర్డు వివాదస్పదంగా మారింది. గజపతుల వారుసురాలిగా తెరపైకి వచ్చిన సంచియిత గజపతి ట్రస్ట్ బోర్డు చైర్మెన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటివరకు ఆలయ అనువంశిక ధర్మకర్త గా వ్యవహారిస్తున్న టీడీపీ నేత అశోక్ గజపతికి చెక్ పెట్టేందుకు ఆయన సోదరుడు ఆనంద గజపతి కూతురు సంచియిత ను తెరపైకి తెచ్చారన్న వివాదం కొనసాగుతుంది. బీజేపీ యువమోర్చా లో సభ్యురాలుగా సంచియిత చుట్టూ రాజకీయ అంశాలు తిరుగుతున్నాయి. కేవలం సేవాభావం, ఆద్యాత్మికతకు తన ప్రాధాన్యత అంటున్నారు సంచియిత.