Sajjala Ramakrishna Reddy: కాంగ్రెస్లో చేరగానే షర్మిల యాస, భాష మారింది
షర్మిల వాడిన భాష సరికాదు - సజ్జల
Sajjala Ramakrishna Reddy: కాంగ్రెస్లో చేరగానే షర్మిల యాస, భాష మారింది
Sajjala Ramakrishna Reddy: భూతద్దంలో చూసినా ఏపీ అభివృద్ధి కనిపించడం లేదని పీసీసీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కాంగ్రెస్లో చేరగానే షర్మిల భాష, యాస మారిందని సజ్జల విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు.