రైతు భరోసా పథకం ప్రారంభించనున్న సీఎం జగన్
-ఇవాళ రైతు భరోసా పథకం ప్రారంభం -నెల్లూరు జిల్లాలో ప్రారంభించనున్న సీఎం జగన్ -విక్రమ సింహపురి యూనివర్శిటీలో భారీ ఎత్తున ఏర్పాట్లు -లబ్ధిదారులకు చెక్కులు, కౌలు రైతులకు ధృవీకరణ పత్రాలు -సుమారు 54 లక్షల మంది రైతులకు చేకూరనున్న లబ్ధి -సాయాన్ని మరో వెయ్యి పెంచుతూ ప్రకటించిన ప్రభుత్వం -రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 13,500 సాయం
జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుభరోసా పథకం నేటి నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. విక్రమసింహపురి యూనివర్శిటీలో ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు రైతుభరోసా పథకాన్ని ప్రారంభించనున్న జగన్ లబ్దిదారులకు చెక్కులు, కౌలు రైతులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా నెల్లూరు జిల్లాకు రానుండటంతో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పర్యవేక్షిస్తున్నారు.
ఈ పథకం ద్వారా సుమారు రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులకు లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి 40 లక్షల మంది రైతులను ఎంపిక చేయడం పూర్తి చేశారు. అయితే ఏటా 12 వేల 500 చొప్పున నాలుగేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి 50 వేల సాయం అందించాలని నిర్ణయించారు. తాజాగా రైతుభరోసా సాయాన్ని పెంచారు. ఇక నుంచి రైతుకు 13 వేల 500 చొప్పున నాలుగేళ్లకు 67 వేల 500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.