కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు ఆంధ్రప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.