విశాఖలో దారుణం.. అప్పు తీర్చలేదని నరకం

Update: 2020-05-20 08:06 GMT

విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. 5వేల అప్పులు తీర్చలేదని ఓ యువడికి నరకం చూపించారు. అతన్ని చెట్టుకు కట్టివేసి చితకబాదారు. దంతేశ్వరరావ్‌ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం స్నేహితుల వద్ద రూ.5వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగివ్వాలని అడగ్గా ఇప్పుడు తన దగ్గర లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఐదుగురు స్నేహితులు అతడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు.

బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. వారు హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్‌ బాలురు కూడా ఉన్నారు. గ్రూపుగా ఏర్పడ్డ కొందరు యువకులు గత ఆరునెలలుగా రౌడీ ఇజానికి పాల్పడుతున్నట్లు తేలింది.  

Tags:    

Similar News