Sabbavaram: దుర్గమాంబ ఆలయంలో చోరీ

స్థానిక దుర్గమాంబ ఆలయంలో దుండగులు రాత్రి చోరీకి పాల్పడ్డారు.

Update: 2020-03-20 03:49 GMT
Durgamamba Temple in Sabbavaram

సబ్బవరం: స్థానిక దుర్గమాంబ ఆలయంలో దుండగులు రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో హుండీలను అపహరించారు. ఆలయ అర్చకులు రేజేటి చంద్రశేఖర్‌ శర్మ రాత్రి 9 గంటల వరకు ఆలయంలో పూజలు చేసి యధావిధిగా అమ్మవారి గుడికి తలుపు వేసి వెళ్లిపోయారు. ఉదయం 6.30 గంటలకు అర్చకులు గుడితలుపు తీయడానికి వచ్చినప్పుడు తాళాలు పగలుగొట్టి తలుపులుతీసి ఉన్నాయి. అర్చకులు లోపలకు వెళ్లి చూడగా నాలుగు హుండీలు కనబడకపోవడంతో ఈ విషయాన్ని ఆలయ కమిటి సభ్యులకు సమాచారాన్ని అందించారు. సుమారు లక్ష రూపాయలు నగదు అపహారణకు గురైందని కమిటి సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News