Ananthapur: మామిల్లపల్లి దగ్గర రోడ్డుప్రమాదం

Ananthapur: అదుపుతప్పి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా * ఒకరు మృతి, పలువురికి గాయాలు

Update: 2021-03-11 05:25 GMT

Representational Image

Ananthapur: అనంతపురం జిల్లా మామిల్లపల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న SRS ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News