శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2020-08-29 06:35 GMT

Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోలేరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మరో 9మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వలస కూలీలు జార్ఖండ్ నుంచి విశాఖ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు క్షతగాత్రుల్ని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News