కడప జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident: స్పిరిట్‌ కాలేజీ వద్ద రెండు బైక్‌లు ఢీ

Update: 2022-10-21 04:00 GMT

కడప జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్పిరిట్‌ కాలేజీ వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News