గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2020-09-09 12:12 GMT

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు లోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కనమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొట్టాయి. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారు ఎదురేదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలూరుకి చెందిన ఉదయ్, నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News