తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులది మలికిపురం మండలం మట్టపర్రుగా గుర్తించారు. తలుపులమ్మలోవ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.