టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. వచ్చే నెల తొమ్మిదవ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. కాగా, 2017లో ఒక స్థలం వివాదంలో వ్యక్తిని నిర్బంధించి, కులం పేరుతో దూషించిన ఘటనలో చింతమనేనిపై కేసు నమోదైంది. అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ కూడా జరిగింది. అయితే, చింతమనేని బెయిల్ పిటీషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. చింతమనేని రిమాండ్ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.