Anantapuram: అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న రేషన్ డీలర్ల సమ్మె

* సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన డీలర్లు * జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని డిమాండ్

Update: 2021-10-27 08:09 GMT

అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న రేషన్ డీలర్ల సమ్మె(ఫైల్ ఫోటో)

Anantapuram: అనంతపురం జిల్లాలో రేషన్ డీలర్ల సమ్మె కొనసాగుతోంది. కమిషన్ బకాయిలతో పాటు గోనె సంచిలు తమకే ఇవ్వాలన్న డిమాండ్‌తో రెండో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు నవంబర్‌కు సంబంధించిన స్టాక్‌ను డీలర్లు స్టాక్ పాయింట్ నుంచి తరలించలేదు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. రాప్తాడు సమీపంలోని MLS పాయింట్ వద్ద ఆందోళన కొనసాగుతుంది.

Tags:    

Similar News