కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..

Update: 2019-11-23 03:41 GMT

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాణ్యం సమీపంలోని ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌ వద్ద ట్రాక్టర్‌-టవేరా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులంతా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మృతులను మార్చురీకి తరలించారు. ట్రాక్టర్‌కు లైట్లు సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇదిలావుంటే ఎన్ని ప్రమాదాలు జరిగినా రవాణా శాఖలో మార్పు రావడం లేదు. ఫిట్ నెస్ లేని వాహనాలను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. వారి నిర్లక్ష్యానికి తాజా ఘటనే ఉదాహరణ. లైట్లు లేని ట్రాక్టర్ ను రోడ్డుమీదకు అది రాత్రిపూట అనుమతించారు. దాంతో ప్రమాదం జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అధికారాల అలసత్వానికి ప్రజలు బలి అవుతున్నారు. 

Tags:    

Similar News