వైసీపీ ఎంపీలు బీజేపీకి టచ్లో ఉన్నారంటూ ఇటీవల ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ స్పందించారు. సుజనాచౌదరి మైండ్ గేమ్ ఆడుతున్నారని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చున్న ఎంపీలను చూసి వైఎస్సార్ సీపీ ఎంపీలు టచ్లో ఉన్నారనుకోవడంలో అర్ధం ఏమిటని అన్నారు. నియోజకవర్గ పనులకోసం బీజేపీ పెద్దలను కలుస్తామని..
అంతమాత్రాన పార్టీ మారుతున్నట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నిజమైన వైసీపీ ఎంపీలు కడవరకూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటారన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీలో చేరేదెవరో సుజనా చౌదరి పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. 22 మంది ఎంపీలూ జగన్ నాయకత్వంలో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.