తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ

Rajadhani Farmers: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది.

Update: 2021-07-01 10:35 GMT

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ

Rajadhani Farmers: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యేను అనుచరులు ర్యాలీగా తీసుకురావాలని చూశారు. దాన్ని రైతులు అడ్డుకోవాలని చూశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న అసైన్డ్ రైతులను కౌలు, పెన్షన్లు 5వేలు, టిడ్కో గృహాలు కేటాయించాలేదని దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఏం సాధించారని రాజధాని గ్రామాల్లో ర్యాలీలు తీస్తారంటూ దళిత రైతులు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి తుళ్లూరు పీఎస్‌ కు తరలించారు.

Tags:    

Similar News