శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు.. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు.. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆమె.. ఈ ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న ఆమె.. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మంటపంలో పీవీ సింధూ కుటుంబానికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు.. మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.