Purandeswari: వైసీపీ సర్కార్పై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ధ్వజం
Purandeswari: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు
Purandeswari: వైసీపీ సర్కార్పై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ధ్వజం
Purandeswari: వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని ధ్వజమెత్తారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులు.. కార్పొరేషన్లకు కేటాయించడం లేదన్నారు. పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులకు వడ్డీలు కట్టడంతోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందన్నారు. అప్పులు చేసి సంపద సృష్టించే ఒక్క నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ స్థాయిలో అప్పులు చేసి... ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.