ఏపీలో మరో ఎస్పీని బదిలీ చేసిన ఎన్నికల సంఘం.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఒంగోలు ఎస్పీ కోయ ప్రవీణ్ ను బదిలీచేసింది ఎన్నికల సంఘం. ఈ మేరకు తగిన ఉత్తర్వులు జారీచేసింది. ఆయన స్థానాల్లో సిద్ధార్థ కౌశల్ను నియమించింది.
మరోవైపు తాడేపల్లి, మంగళగిరి సీఐలపైనా కూడా బదిలీ వేటు వేసింది. తాడేపల్లి కొత్త సీఐగా సురేశ్ కుమార్ను నియమించింది. కాగా ఇటీవల శ్రీకాకుళం, కడప ఎస్పీలతో పాటు, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ తప్పించింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పునేఠాను సైతం బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వి సుబ్రమణ్యంను నియమించింది.