Chintapalle: క్వారంటైన్‌ ధ్రువీకరణ ఉంటేనే ఏజెన్సీలోకి అనుమతి

ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు నుంచి కొత్త వ్యక్తులు విశాఖ ఏజెన్సీలోకి రావాలనుకుంటే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి క్వారంటైన్‌ విభాగం వైద్యులు ధ్రువీకరణను చెక్‌పోస్ట్‌లో చూపించాల్సి ఉంటుందని చింతపల్లి ఎఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు.

Update: 2020-04-04 05:58 GMT

ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు నుంచి కొత్త వ్యక్తులు విశాఖ ఏజెన్సీలోకి రావాలనుకుంటే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి క్వారంటైన్‌ విభాగం వైద్యులు ధ్రువీకరణను చెక్‌పోస్ట్‌లో చూపించాల్సి ఉంటుందని చింతపల్లి ఎఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు.కరోనా కట్టడిలో భాగంగా ఏజెన్సీలోని మైదానప్రాంత వాసుల ప్రవేశాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు.

ఈ మేరకు చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో డౌనూరు, కేడిపేట అల్లూరి పార్కు వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామన్నారు. ఎవరైనా ఏజెన్సీలోకి రాదలిస్తే క్వారంటైన్‌ను సంప్రదించి, వైద్యుల ధ్రువీకరణతో రావాలని సూచించారు.



Tags:    

Similar News