Tirumala: తిరుమల కొండపై మరోసారి విమానం చక్కర్లు
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి విమాన రాకపోకలు కలకలం రేపుతున్నాయి.
ఫైల్ ఫోటో
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి విమాన రాకపోకలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా తిరుమల కొండపై నుంచి విమానాలు తరుచూ వెళ్తుండటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ ఏకంగా ఆలయం గగనతలంపై నుంచి ఓ విమానం వెళ్ళింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా.. ఆధ్మాత్మిక క్షేత్రం పై నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని టీటీడీ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ.. విమానయానశాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.