ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న జనసేనాని

Update: 2021-01-22 09:02 GMT

ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. రాత్రి 7గంటలకు ఒంగోలు చేరుకోనున్న జనసేనాని స్థానిక మౌర్య హోటల్లో బస చేయనున్నారు. అదేవిధంగా రాత్రి 8గంటలకు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10గంటలకు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సహాయం అందిస్తారు. అనంతరం జిల్లా ఎస్పీని కలవనున్న జనసేనాని వైసీపీ నాయకుల దౌర్జన్యంపై ఫిర్యాదు చేయనున్నారు.

Tags:    

Similar News