Pawan Kalyan: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్పై స్పందించిన జనసేనాని పవన్
Pawan Kalyan: తుఫాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్
పవన్ కళ్యణ్ (ఫైల్ ఇమేజ్)
Pawan Kalyan: ఏపీలో గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. గులాబ్ తుఫాన్ బాధితులను ప్రభుత్వం సానుకూల దక్పధంతో ఆదుకోవాలని కోరారు. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం నామ మాత్రపు సాయంతో సరిపెట్టవద్దన్న పవన్ రైతులు, కౌలు రైతులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎకరానికి 25 నుంచి 30 వేలు ఇస్తేనే రైతులు కోలుకోగలరని వైసీపీ ప్రభుత్వానికి జనసేనాని తెలిపారు.