చంద్రబాబు సీఎం అయ్యాక.. గంట కళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం -సునీత

Paritala Sunitha: మాజీమంత్రి ‎పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

Update: 2021-10-22 07:23 GMT

పరిటాల సునీత (ఫైల్ ఇమేజ్)

Paritala Sunitha: చంద్రబాబు దీక్ష రెండోరోజు కొనసాగుతోంది. ఈ దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన టీడీపీ సీనియర్‌ నేత పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ హాట్‌ కామెంట్స్ చేశారు పరిటాల సునీత. ఇప్పటికే తమ రక్తం ఉడుకుతోందని, ఒక్కసారి తమను వదిలేస్తే మంత్రులను రోడ్లపై తిగరనివ్వకుండా చేస్తామన్నారు. చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. 


Full View


Tags:    

Similar News