Visakhapatnam: విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు ఏడాది పూర్తి

Visakhapatnam: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విశాఖపట్నం విలవిలలాడింది.

Update: 2021-05-07 06:58 GMT

Visakhapatnam: విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు ఏడాది పూర్తి

Visakhapatnam: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విశాఖపట్నం విలవిలలాడింది. తెల్లవారక ముందే విషవాయువు 12మంది ఊపిరి తీసింది. వేలాది మందిని అచేతనంగా మార్చేసింది. విశాఖలోని వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో స్టైరీన్ గ్యాస్ గత ఏడాది మే 7న లీకైంది. ఆ గ్యాస్‌ పీల్చిన వారంత కుప్పకూలిపోయారు. ప్రజలంతా ప్రాణాలు అరచేత పట్టుకుని దూరంగా పారిపోయేందుకు పరుగులు తీశారు. ఆ దుర్ఘటన స్థానికుల జీవితాల్లో పీడకలగా మిగిలిపోయింది. ఆ భయనక దృశ్యాలు తలుచుకుంటే స్థానికులు ఇప్పటికీ ఉలిక్కిపడుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మానని గాయంగానే బాధితులను వేధిస్తోంది. భారీ స్థాయిలో ప్రమాదం జరిగినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Tags:    

Similar News