కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..

Update: 2019-11-16 06:50 GMT

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న కారు టిప్పర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీపట్నం మండలంలోని దోనబండ గ్రామ సమీపంలో జరిగింది. ప్రమాదం ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎక్సైజ్ ఎస్‌ఐగా గుర్తించారు. ప్రమాద బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతి వేగం కారణంగా అదుపుతప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయింది.

 


Tags:    

Similar News