Representation Photo
Corona Cases in Andhra Pradesh: ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,248 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. 15 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో 20 లక్షల నాలుగు వేల 590 మంది కోరనా వైరస్ భారీన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మృతుల సంఖ్య 13 వేల 750కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ర్టంలో 13,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.