MP Kesineni Shivanath: విజయవాడలో మరిన్ని జాతీయ పోటీలకు కృషి

MP Kesineni Shivanath: విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌‌‎షిప్‌ పోటీలు ప్రారంభం అయ్యాయి.

Update: 2025-12-22 08:52 GMT

MP Kesineni Shivanath: విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌‌‎షిప్‌ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంలో జరగనున్న ఈ పోటీలను ఎంపీ కేశినేని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్, శాప్ చైర్మన్ రవి నాయుడు, స్వచ్ఛంద్రా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌‌‎షిప్‌‌లు జరగడం గర్వకారణమని... క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందనీ ముఖ్య అతిథులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీలను విజయవాడకు తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News